ఏ బ్యాక్‌ గ్రౌండ్ ఉన్నా టెక్నాలజీ ముఖ్యం : బాలకిష్టారెడ్డి

ఏ బ్యాక్‌ గ్రౌండ్ ఉన్నా టెక్నాలజీ ముఖ్యం : బాలకిష్టారెడ్డి
  • విద్యార్థులకు బాలకిష్టారెడ్డి సూచన

బషీర్​బాగ్​,వెలుగు : ప్రపంచంతో పోటీ పడాలంటే మారుతున్న టెక్నాలజీని విద్యార్థులు అందిపుచ్చుకుని ముందుకు వెళ్లాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అన్నారు. అబిడ్స్​లోని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీలో ‘రీసెర్చ్ ఇన్ ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ ఇన్ ఇంజినీరింగ్’ అంశంపై శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 బీఏ, బీకాం, ఇంజనీరింగ్ వంటి ఏ బ్యాక్‌ గ్రౌండ్ ఉన్నా విద్యార్థులకు టెక్నాలజీ ముఖ్యమన్నారు. ఉన్నత విద్యా మండలిలో టెక్నాలజీని అనుసంధానం చేస్తూ సిలబస్​లో మార్పులు తెస్తున్నట్లు తెలిపారు.