సరైన ఆహారం తీసుకోవడమే ఆరోగ్యం

సరైన ఆహారం తీసుకోవడమే ఆరోగ్యం

హైదరాబాద్ : సరైన ఆహారం తీసుకోవడమే ఆరోగ్యమన్నారు కస్టమ్స్ అండ్ GST చీఫ్ కమిషనర్ శివనాగ కుమారి. ఆజాదికా అమృత మహోత్సవ్ లో భాగంగా తార్నాకలో ఈట్ రైట్ మేలా నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. న్యూట్రిషన్ కు సంబంధించిన వివిధ స్టాల్స్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు భారత్ రెడ్డి, NIN అధికారులు పాల్గొన్నారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దానిపై ప్రజల్లో అవగాహన రావాలన్నారు యాక్టర్ భారత్ రెడ్డి.