హనుమకొండ కలెక్టరేట్/ కాశీబుగ్గ/ భూపాలపల్లి రూరల్/ జనగామ అర్బన్/ ములుగు/ వెంకటాపూర్/ ఖమ్మం టౌన్, వెలుగు: పెండింగ్ అర్జీలన్నీ త్వరగా పరిష్కరించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లలో నిర్వహించిన ప్రజావాణిలో వారు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. హనుమకొండ ప్రజావాణికి 263 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు.
వరంగల్ గ్రీవెన్స్కు 211 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ సత్యశారద చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్శర్మ ప్రజల నుంచి 112 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. జనగామలో 396 వినతులు వచ్చాయని కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలుపగా, ములుగులో మొత్తం 96 దరఖాస్తులు వచ్చాయని అడిషనల్ కలెక్టర్ సీహెచ్మహేందర్జీ చెప్పారు. ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో కలెక్టర్ దివాకర ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
