ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. బస్సు చార్జీల తగ్గింపు

ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. బస్సు చార్జీల తగ్గింపు
  •  పుష్పక్​ బస్సుల్లో రూ.50 నుంచి రూ.100 తక్కువ చేసిన ఆర్టీసీ

హైదరాబాద్​సిటీ, వెలుగు: నగరంలో పుష్పక్​బస్సు చార్జీలను తగ్గిస్తూ గ్రేటర్​ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్​పోర్ట్​కు వెళ్లడానికి, ఎయిర్​ పోర్ట్​ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే వారి సౌలభ్యం కోసం చార్జీలను రూ.50  నుంచి రూ.100 వరకు తగ్గించారు.

 ప్రస్తుతం ఎయిర్​పోర్ట్​ నుంచి శంషాబాద్​కు రూ.200 తీసుకుంటుండగా, రూ.100 తగ్గించారు. ఎయిర్​పోర్ట్​ నుంచి ఆరామ్ ఘర్​ వరకు రూ.250 వసూలు చేస్తుండగా, ఇక నుంచి రూ.200 తీసుకుంటారు. ఎయిర్​పోర్ట్​ నుంచి మెహదీపట్నం వరకు రూ.350 చార్జీ కాగా ఇక నుంచి రూ.300 తీసుకుంటారు. ఎయిర్​పోర్ట్​ నుంచి పహాడీ షరీఫ్​కు రూ.200 కాగా, రూ. 100 చేశారు.

 బాలాపూర్​కు రూ.250 కాగా, తాజాగా రూ.200గా నిర్ణయించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ప్రస్తుతం ఉన్న చార్జీల్లోనూ రూ.50 తగ్గించారు. ఎయిర్​పోర్ట్​ నుంచి జూబ్లీ బస్టాండ్, జేఎన్​టీయూ, మియాపూర్, లింగంపల్లికి రూ.450 కాగా ఇక నుంచి రూ.400 తీసుకోనున్నారు. ఈ చార్జీలు శుక్రవారం నుంచే అమలులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.