- మల్కాజిగిరి ఎస్ వోటీ పోలీసులు
- 100 కిలోల సరుకు సీజ్
హైదరాబాద్, వెలుగు: వైజాగ్ నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు సప్లయర్లను మల్కాజిగిరి ఎస్ వోటీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. బుధవారం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం..ఒడిశాలోని గంజామ్ ఇచాపూర్కు చెందిన భువన సబర్(20), బరంపూర్కు చెందిన వరుణ్కుమార్ పట్నాయక్(24) డిగ్రీ చదివారు. ఏపీలోని వైజాగ్కు వచ్చి హనుమంతపూర్ జంక్షన్లో హార్డ్వేర్ షాప్ నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో స్థానిక గంజాయి సప్లయర్ సురేశ్తో వారికి పరిచయం ఏర్పడింది.
భువన సబర్, వరుణ్కుమార్తో మహారాష్ట్ర, పుణేకు గంజాయి సప్లయ్ చేయించాలని సురేశ్ ప్లాన్ చేశాడు. మహారాష్ట్రకు చెందిన చోటు అనే పెడ్లర్కు గంజాయిని అందించేందుకు భువన సబర్, వరుణ్ కుమార్ 100 కిలోల సరుకుతో వైజాగ్ నుంచి కారులో బయలుదేరారు. దీని గురించి సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్వోటీ ఇన్స్పెక్టర్ రాములు టీమ్ నిఘా పెట్టింది. కీసరలో కారును గుర్తించి.. భువన సబర్, వరుణ్ కుమార్ను అదుపులోకి తీసుకుంది. 100 కిలోల గంజాయితో పాటు కారును సీజ్ చేసింది. సురేశ్, చోటు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు.