పిల్లల్లేరు..పెద్దల్లేరు ఆడవాళ్లయితే చాలు .. మహిళలను వేధిస్తున్న ఆకతాయిలు

పిల్లల్లేరు..పెద్దల్లేరు ఆడవాళ్లయితే చాలు .. మహిళలను వేధిస్తున్న ఆకతాయిలు
  •  ఆటకట్టిస్తున్న రాచకొండ  షీ టీమ్స్​  
  •  గత నెలలో 240 మందిపై కేసులు  
  • నిందితుల్లో ముసలోళ్లు, పిల్లలు..
  • నేర తీవ్రతను బట్టి క్రిమినల్​కేసులు, కౌన్సెలింగ్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: బాలికలు, మహిళలను వేధిస్తున్న పోకిరీల పని పడుతున్నారు రాచకొండ షీ టీమ్స్​పోలీసులు. గత నెల రోజుల్లో పబ్లిక్​ప్లేసులతో పాటు సోషల్​మీడియా, ఫోన్ల ద్వారా, ఇతర రకాలుగా మహిళలను వేధిస్తున్న 240 మందిపై కేసులు పెట్టారు. ఇందులో నేర తీవ్రతను బట్టి కొందరికి కౌన్సిలింగ్​ఇచ్చి వదిలేయగా మరికొందరిపై  క్రిమినల్​కేసులు పెట్టి జైలుకు పంపారు. అయితే, నిందితుల్లో మైనర్లతో పాటు 70 ఏండ్లు నిండిన సీనియర్​సిటిజన్స్​పట్టుబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎవరు వేధించినా సైలెన్స్​గా ఉండొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, అప్పుడే మరొకరికి ఇలాంటి పరిస్థితి రాదని సీపీ జి.సుధీర్ బాబు సూచిస్తున్నారు.  

డెకాయ్​ ఆపరేషన్లతో.. 

జనావాసాల్లో ఉన్న పోకిరీలను గుర్తించడానికి షీ టీమ్స్​పోలీసులు నిరంతరం డెకాయ్​ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, పబ్లిక్​ప్లేసుల్లో మఫ్టీలో తిరుగుతూ పోకిరీల చేష్టలను వీడియోలు తీస్తూ పట్టుకొని సాక్ష్యాధారాలతో సహా కోర్టుకు రిమాండ్​చేస్తున్నారు. నిందితుల్లో మైనర్లు ఉంటే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారి తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సిలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చి హెచ్చరించి వదిలేస్తున్నారు. నేర తీవ్రత ఎక్కువగా ఉంటే క్రిమినల్​కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతున్నారు. మెట్రో రైళ్లలోని మహిళా కంపార్మెంట్లలోకి ఎక్కే మగవారిని పట్టుకుని ఫైన్లు వేయిస్తున్నారు. గత నెలలో రాచకొండ పరిధిలోని మెట్రో రైల్​రూట్​లో దొరికిన10  మందికి మెట్రో అధికారులతో ఫైన్ వేయించారు.  

పట్టుకొని కేసులు, కౌన్సెలింగ్​.. 

డెకాయ్​ఆపరేషన్లతో పాటు ఫోన్, సోషల్​మీడియా, పబ్లిక్​ప్లేసుల్లో వేధిస్తున్నారని మే 1 నుంచి 31వ తేదీ వరకు 288  ఫిర్యాదులు వచ్చాయని ఉమెన్​సేఫ్టీ వింగ్​డీసీపీ ఉషారాణి తెలిపారు. ఉమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు వారం కింద రాచకొండ క్యాంప్ ఆఫీసులో కౌన్సిలింగ్ ఇచ్చారు. 240 మందిని పట్టుకోగా, ఇందులో మైనర్లు 80 మంది ఉన్నారు. ఫోన్ల ద్వారా వేధించిన కేసులు -42 నమోదు కాగా,  సోషల్​మీడియా ద్వారా 102 , నేరుగా 144 మంది వేధించారు. ఇందులో 18 మందిపై క్రిమినల్ కేసులు- పెట్టారు. 110  మందికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశామని ఆఫీసర్​ఉషారాణి  తెలిపారు. మే నెలలో 94 అవేర్​నెస్​ప్రోగ్రామ్స్​నిర్వహించామని, 12753 మందికి మహిళా చట్టాలు,  వారి హక్కులు, నేరాలు, జాగ్రత్తల గురించి వివరించామన్నారు.  

క్రికెటర్​నూ వదల్లే.. 

రాచకొండ కమిషనరేట్​పరిధిలో ఓ యువతి క్రికెట్ కోచింగ్ తీసుకుంటోంది. అదే కోచింగ్ సెంటర్ లో ట్రైనింగ్ తీసుకునే వ్యక్తి ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పగా తిరస్కరించింది. దీంతో  నిందితుడు ‘ప్రేమించకపోయిన పరవాలేదు..ఓయో రూమ్ కి రా..! లేకపోతే నీ ఫొటోలు మార్ఫింగ్​చేసి అందరికీ పంపిస్తా’ అని బెదిరించాడు. దీంతో షీ టీమ్స్​ను సంప్రదించగా కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. 

లూడో ద్వారా పరిచయమై..

ఓ బాలికకు ఆన్‌‌లైన్ గేమింగ్ అప్లికేషన్ (లూడో) ద్వారా పరిచమమయ్యాడో యువకుడు.. తర్వాత ఇన్​స్టాగ్రామ్ లో మెసేజ్ చేసేవాడు. అతడి ప్రవర్తన నచ్చక ఆ బాలిక అతడితో మాట్లాడడం మానేసింది. దీంతో అతడు ‘నువ్వు నాతో మాట్లాడిన ఫొటోలు మార్ఫింగ్​చేసి న్యూడ్​ఫొటోలుగా మార్చి సోషల్​మీడియాలో షేర్​చేస్తా ’ అని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో షీ టీం ను  సంప్రదించగా నిందితుడిని జైలుకు పంపారు.

ముసలోడే కానీ... 

మూడేండ్లుగా ఓ బాలిక కుటుంబసభ్యులు నిందితుడి ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. ఇంటి ఓనర్​అయిన నిందితుడు (73) ఇంట్లో ఎవరూ లేనప్పుడు బాలిక దగ్గరికి వెళ్లి శారీరకంగా వేధించేవాడు. కుటుంబసభ్యులకు చెప్పినా అతడు అలాంటి వాడు కాదని బాలికనే తిట్టేవారు. నిందితుడు  ఒక రోజు బాలిక దగ్గరికి వచ్చి లైంగికంగా వేధిస్తుండగా మొబైల్​ఫోన్​లో రికార్డ్​చేసింది. తర్వాత కుటుంబసభ్యులకు చూపించగా, షీ టీమ్స్​కు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు వృద్ధుడిపై క్రిమినల్ కేసు పెట్టి నిందితుడిని జైలుకు   పంపారు.