
- ఆటకట్టిస్తున్న రాచకొండ షీ టీమ్స్
- గత నెలలో 240 మందిపై కేసులు
- నిందితుల్లో ముసలోళ్లు, పిల్లలు..
- నేర తీవ్రతను బట్టి క్రిమినల్కేసులు, కౌన్సెలింగ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: బాలికలు, మహిళలను వేధిస్తున్న పోకిరీల పని పడుతున్నారు రాచకొండ షీ టీమ్స్పోలీసులు. గత నెల రోజుల్లో పబ్లిక్ప్లేసులతో పాటు సోషల్మీడియా, ఫోన్ల ద్వారా, ఇతర రకాలుగా మహిళలను వేధిస్తున్న 240 మందిపై కేసులు పెట్టారు. ఇందులో నేర తీవ్రతను బట్టి కొందరికి కౌన్సిలింగ్ఇచ్చి వదిలేయగా మరికొందరిపై క్రిమినల్కేసులు పెట్టి జైలుకు పంపారు. అయితే, నిందితుల్లో మైనర్లతో పాటు 70 ఏండ్లు నిండిన సీనియర్సిటిజన్స్పట్టుబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎవరు వేధించినా సైలెన్స్గా ఉండొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, అప్పుడే మరొకరికి ఇలాంటి పరిస్థితి రాదని సీపీ జి.సుధీర్ బాబు సూచిస్తున్నారు.
డెకాయ్ ఆపరేషన్లతో..
జనావాసాల్లో ఉన్న పోకిరీలను గుర్తించడానికి షీ టీమ్స్పోలీసులు నిరంతరం డెకాయ్ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, పబ్లిక్ప్లేసుల్లో మఫ్టీలో తిరుగుతూ పోకిరీల చేష్టలను వీడియోలు తీస్తూ పట్టుకొని సాక్ష్యాధారాలతో సహా కోర్టుకు రిమాండ్చేస్తున్నారు. నిందితుల్లో మైనర్లు ఉంటే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారి తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించి వదిలేస్తున్నారు. నేర తీవ్రత ఎక్కువగా ఉంటే క్రిమినల్కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతున్నారు. మెట్రో రైళ్లలోని మహిళా కంపార్మెంట్లలోకి ఎక్కే మగవారిని పట్టుకుని ఫైన్లు వేయిస్తున్నారు. గత నెలలో రాచకొండ పరిధిలోని మెట్రో రైల్రూట్లో దొరికిన10 మందికి మెట్రో అధికారులతో ఫైన్ వేయించారు.
పట్టుకొని కేసులు, కౌన్సెలింగ్..
డెకాయ్ఆపరేషన్లతో పాటు ఫోన్, సోషల్మీడియా, పబ్లిక్ప్లేసుల్లో వేధిస్తున్నారని మే 1 నుంచి 31వ తేదీ వరకు 288 ఫిర్యాదులు వచ్చాయని ఉమెన్సేఫ్టీ వింగ్డీసీపీ ఉషారాణి తెలిపారు. ఉమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు వారం కింద రాచకొండ క్యాంప్ ఆఫీసులో కౌన్సిలింగ్ ఇచ్చారు. 240 మందిని పట్టుకోగా, ఇందులో మైనర్లు 80 మంది ఉన్నారు. ఫోన్ల ద్వారా వేధించిన కేసులు -42 నమోదు కాగా, సోషల్మీడియా ద్వారా 102 , నేరుగా 144 మంది వేధించారు. ఇందులో 18 మందిపై క్రిమినల్ కేసులు- పెట్టారు. 110 మందికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశామని ఆఫీసర్ఉషారాణి తెలిపారు. మే నెలలో 94 అవేర్నెస్ప్రోగ్రామ్స్నిర్వహించామని, 12753 మందికి మహిళా చట్టాలు, వారి హక్కులు, నేరాలు, జాగ్రత్తల గురించి వివరించామన్నారు.
క్రికెటర్నూ వదల్లే..
రాచకొండ కమిషనరేట్పరిధిలో ఓ యువతి క్రికెట్ కోచింగ్ తీసుకుంటోంది. అదే కోచింగ్ సెంటర్ లో ట్రైనింగ్ తీసుకునే వ్యక్తి ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పగా తిరస్కరించింది. దీంతో నిందితుడు ‘ప్రేమించకపోయిన పరవాలేదు..ఓయో రూమ్ కి రా..! లేకపోతే నీ ఫొటోలు మార్ఫింగ్చేసి అందరికీ పంపిస్తా’ అని బెదిరించాడు. దీంతో షీ టీమ్స్ను సంప్రదించగా కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
లూడో ద్వారా పరిచయమై..
ఓ బాలికకు ఆన్లైన్ గేమింగ్ అప్లికేషన్ (లూడో) ద్వారా పరిచమమయ్యాడో యువకుడు.. తర్వాత ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసేవాడు. అతడి ప్రవర్తన నచ్చక ఆ బాలిక అతడితో మాట్లాడడం మానేసింది. దీంతో అతడు ‘నువ్వు నాతో మాట్లాడిన ఫొటోలు మార్ఫింగ్చేసి న్యూడ్ఫొటోలుగా మార్చి సోషల్మీడియాలో షేర్చేస్తా ’ అని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో షీ టీం ను సంప్రదించగా నిందితుడిని జైలుకు పంపారు.
ముసలోడే కానీ...
మూడేండ్లుగా ఓ బాలిక కుటుంబసభ్యులు నిందితుడి ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. ఇంటి ఓనర్అయిన నిందితుడు (73) ఇంట్లో ఎవరూ లేనప్పుడు బాలిక దగ్గరికి వెళ్లి శారీరకంగా వేధించేవాడు. కుటుంబసభ్యులకు చెప్పినా అతడు అలాంటి వాడు కాదని బాలికనే తిట్టేవారు. నిందితుడు ఒక రోజు బాలిక దగ్గరికి వచ్చి లైంగికంగా వేధిస్తుండగా మొబైల్ఫోన్లో రికార్డ్చేసింది. తర్వాత కుటుంబసభ్యులకు చూపించగా, షీ టీమ్స్కు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు వృద్ధుడిపై క్రిమినల్ కేసు పెట్టి నిందితుడిని జైలుకు పంపారు.