ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలి : రవిగౌడ్‌‌‌‌

ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలి : రవిగౌడ్‌‌‌‌

ములుగు, వెలుగు : ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు, పెండింగ్‌‌‌‌లో ఉన్న రెండు నెలల జీతాన్ని చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గుండెబోయిన రవిగౌడ్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేశారు. ఆదివారం ములుగులో నిర్వహించిన మీటింగ్‌‌‌‌లో ఆయన మాట్లాడారు. పారితోషికాల విధానాన్ని రద్దు చేసి కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు.

మేడారంలో డ్యూటీలో ఉండే ఆశావర్కర్లకు రోజుకు రూ. 1000 చొప్పున టీఏ, డీఏ చెల్లించాలని, ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. సమావేశంలో చుంచు మంజుల, రత్నం నీలాదేవి, దేవక్క, కవిత, వసంత, పాప, రాజ్యలక్ష్మీ, మాధవి, కవిత పాల్గొన్నారు.