
హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఏఆర్ఎం ఆగ్రోస్ ఇండస్ట్రీస్ ఆస్తులపై పౌర సరఫరాల సంస్థ చైర్మన్ సర్ధార్ రవీందర్సింగ్ ఆరా తీసినట్టు తెలిసింది. గురువారం తన స్నేహితుడి ఇంట్లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి అటెండ్అయిన ఆయన.. అనంతరం జిల్లా సివిల్ సప్లై అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ హరీశ్తో పలు రైస్మిల్లులను పరిశీలించారు. ఇందులో భాగంగానే ఏఆర్ఎం ఆగ్రోస్ ఇండస్ట్రీస్ మిల్లును పరిశీలించి యజమాని ఆస్తుల వివరాలను తెలుసుకున్నట్టు సమాచారం.
కొద్ది నెలల కింద మిల్లు యజమాని 9,523 మెట్రిక్ టన్నుల వడ్లను మాయం చేసినట్టు తేలడంతో ఆఫీసర్లు ఆయపై కేసు పెట్టారు. ప్రభుత్వం ఈ మిల్లుకు 2021లో వానాకాలం, యాసంగి సీజన్ కలిసి 11,427 మెట్రిక్ టన్నుల వడ్లను కేటాయించింది. అయితే మిల్లు యజమాని 2 వేల మెట్రిక్ టన్నుల వడ్లను మాత్రమే బియ్యంగా మరాడించి సీఎంఆర్ కింద అప్పగించారు. మిగితా 9,523 మెట్రిక్ టన్నుల వడ్లను బియ్యంగా చేసి బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్టు తేలింది. దీని విలువ రూ.27.76కోట్లు ఉంటుందని లెక్కగట్టారు. ప్రస్తుతంం రికవరీ ప్రాసెస్ నడుస్తోంది.