గణతంత్ర దినోత్సవం 2024.. చరిత్ర, ప్రాముఖ్యత.. ఈ ఏడాది థీమ్ ఏంటంటే..

గణతంత్ర దినోత్సవం 2024.. చరిత్ర, ప్రాముఖ్యత.. ఈ ఏడాది థీమ్ ఏంటంటే..

రాజ్యాంగం కేవలం న్యాయవాదులు సమర్పించిన పత్రం కాదని, ఇది దేశ ప్రజల జీవితాలను నడిపే వాహనమని, దీని స్ఫూర్తి ఎప్పటికీ నిలిచి ఉంటుందని మన రాజ్యాంగాన్ని ఆమోదించినందుకు గుర్తుగా భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. భారత రాజ్యాంగానికి 1950లో ఆమోదం లభించింది. భారతదేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతోన్న ఈ సమయంలో... భారతదేశం గొప్ప సంప్రదాయం, సాంస్కృతిక వారసత్వం, దేశం పురోగతి, విజయాల దృశ్యాలు, భారత సైన్యం, భారత నౌకాదళం, వైమానిక ప్రదర్శనలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్, బీటింగ్ ది రిట్రీట్  సైతం వేడుకలకు సన్నద్దమవుతున్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లోనూ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

భారతదేశం ఏటా గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న జరుపుకుంటుంది. ఈ సంవత్సరం, ఈ రోజు శుక్రవారం నాడు రాబోతోంది. దేశంలోని పౌరులు దీన్ని 75వ గణతంత్ర దినోత్సవంగా జరుపుకోనున్నారు.

చరిత్ర, ప్రాముఖ్యత

గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26, 1950న భారత రాజ్యాంగాన్ని ఆమోదించినందుకు జ్ఞాపకార్థంగా జరుపుకుంటారు. భారతదేశం 1947లో బ్రిటిష్ నుండి స్వాతంత్ర్యం పొందినప్పటికీ, జనవరి 26, 1950లోనే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అప్పుడే దేశం సార్వభౌమ, గణతంత్ర రాజ్యంగా మారింది. రాజ్యాంగ సభ తన మొదటి సెషన్‌ను డిసెంబర్ 9, 1946న నిర్వహించింది. చివరి సమావేశాన్ని నవంబర్ 26, 1949న నిర్వహించింది. ఆపై ఒక సంవత్సరం తర్వాత రాజ్యాంగం ఆమోదించబడింది. డాక్టర్ BR అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నాయకత్వం వహించారు. కావున ఈ రోజున, భారతదేశం ఈ రోజున రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటోంది.

1930లో భారత జాతీయ కాంగ్రెస్ వలస పాలన నుండి పూర్ణ స్వరాజ్‌ని ప్రకటించిన ఈ రోజున స్వతంత్ర భారతదేశ స్ఫూర్తిని గణతంత్ర దినోత్సవం గుర్తుచేసుకుంటుంది. గణతంత్ర దినోత్సవం ప్రజాస్వామ్యబద్ధంగా తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే భారతీయ పౌరుల శక్తిని కూడా గుర్తుచేస్తుంది. కావున దేశం భారత రాజ్యాంగ స్థాపన జ్ఞాపకార్థం ఈ రోజును జాతీయ సెలవుదినంగా గుర్తించింది, ప్రకటించింది.

వేడుకలు:

దేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈ రోజు రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తరువాత అద్భుతమైన సైనిక, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. వీటితో పాటు భారత రాష్ట్రపతి దేశంలోని అర్హులైన పౌరులకు పద్మ అవార్డులను అందజేస్తారు. వీర సైనికులకు పరమవీర చక్ర, అశోక్ చక్ర, వీరచక్ర ప్రదానం చేస్తారు. రిపబ్లిక్ డే పరేడ్ ప్రత్యక్ష ప్రసారాలు, వెబ్‌కాస్ట్‌లు కూడా ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలకు అందుబాటులో ఉంటాయి.

కవాతు సమయం, ఈ ఏడాది థీమ్:

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం 2024 పరేడ్ థీమ్ ' విక్షిత్ భారత్ ', ' భారత్ - లోక్తంత్ర కి మాతృక '. ఇది ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దేశంగా భారతదేశం పాత్రను నొక్కి చెబుతుంది. జనవరి 26, శుక్రవారం ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని కర్తవ్య మార్గంలో ఇది ప్రారంభం కానుంది. ఇది దాదాపు 90 నిమిషాల పాటు కొనసాగుతుందని అంచనా. ఈ వేదిక 77వేల మంది సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంది. 42వేల సీట్లు సాధారణ ప్రజల కోసం రిజర్వు చేయబడ్డాయి. ఈ సంవత్సరం ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ నుంచి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరుకానున్నారు. ఇక ఈ సందర్భంగా సాగే కవాతులో 95 మంది సభ్యుల కవాతు బృందం, 33 మంది సభ్యుల బ్యాండ్ బృందం కూడా ఉంటుంది.