
న్యూఢిల్లీ: టీమిండియా బ్యాటర్, హైదరాబాదీ హనుమ విహారి ఇరానీ ట్రోఫీలో పోటీపడే రెస్టాఫ్ ఇండియాకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. మూడేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ట్రోఫీలో రంజీ చాంప్ సౌరాష్ట్రతో రెస్టాఫ్ ఇండియా తలపడుతుంది. అక్టోబర్ 1–5 మధ్య రాజ్కోట్లో జరిగే మ్యాచ్కు 15 మందితో కూడిన ‘రెస్ట్’ టీమ్ బీసీసీఐ బుధవారం ప్రకటించింది. మయాంక్, ప్రియాంక్తో పాటు దులీప్ ట్రోఫీలో సత్తా చాటిన యశ్ ధూల్, యశస్వి, యంగ్పేసర్ ఉమ్రాన్, హిట్టర్ సర్ఫరాజ్ ఖాన్లకు చోటు దక్కింది.
రెస్టాఫ్ ఇండియా టీమ్: విహారి (కెప్టెన్), మయాంక్, ప్రియాంక్, అభిమన్యు ఈశ్వరన్, యశ్ ధూల్, సర్ఫరాజ్, యశస్వి, కేఎస్ భరత్, ఉపేంద్ర, జయంత్, సౌరభ్ కుమార్, సాయి కిశోర్, ముకేశ్, ఉమ్రాన్, కుల్దీప్ సేన్, అర్జాన్.