రామచంద్రాపురం, వెలుగు: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ను ఉపాధ్యాయులు బహిష్కరించారు. సంగారెడ్డి జిల్లా అశోక్నగర్లోని సెయింట్ ఆర్నాల్డ్స్కూల్లో ఆదివారం వాల్యుయేషన్ విధులకు హాజరైన టీచర్లు మూకుమ్మడిగా బహిష్కరించి ఆందోళనకు దిగారు. వాల్యుయేషన్ రెమ్యునరేషన్ చార్జీలను రెట్టింపు చేయాలని, పెండింగ్లో ఉన్న గతేడాది బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. నాలుగు రోజులుగా టెన్త్ వాల్యుయేషన్ జరుగుతుండగా టీచర్ల ఆందోళనతో ఆదివారం బ్రేక్ పడింది.
సంగారెడ్డి డీఈవో వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకొని వారితో చర్చించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఈవోకు అందజేశారు. నిరసనలో టీపీటీఎఫ్ జిల్లా ప్రెసిడెంట్ సోమశేఖర్, టీఎస్యూటీఎఫ్ జిల్లా జనరల్ సెక్రటరీ సాయిలు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రాథోడ్, టీపీయూఎస్ ప్రధాన కార్యదర్శి సుధాకర్, జేఏసీ నాయకులు లక్ష్మారెడ్డి, సయ్యద్ సాబేర్, శ్రీనివాస్, జగన్నాథ్, రమణ కుమార్, విశాలి, గోపాల్, సర్ఫరాజ్ పాల్గొన్నారు.
