- సర్కారు నుంచి బిల్లులు రాక పొలం అమ్ముకున్నడు
- నిజామాబాద్ జిల్లా ఆరేపల్లిలో దళిత సర్పంచ్ బతుకు పోరాటం
నిజామాబాద్, వెలుగు: చేసిన పనులకు సర్కారు బిల్లులు ఇవ్వకపోవడంతో ఓ సర్పంచ్ సెక్యూరిటీ గార్డుగా మారాడు. ఉదయం సర్పంచ్గా పని చేస్తూ.. రాత్రి అపార్ట్మెంట్ వాచ్మన్గా డ్యూటీ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఆరేపల్లి గ్రామపంచాయతీ ఎస్సీ రిజర్వ్అయింది. సర్పంచ్ పదవికి ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో లక్కీడిప్ద్వారా ఇరుసు మల్లేశ్ను 2019లో సర్పంచ్ గా ఎన్నుకున్నారు. గ్రామ జనాభా 434. గ్రామ పంచాయతీకి స్టేట్ఫైనాన్స్కమిషన్నుంచి జనాభా ప్రాతిపాదికన నెలకు రూ.37 వేలు వస్తాయి. అయితే ఈ నిధులు పంచాయతీ కరెంట్చార్జీలు, సిబ్బంది జీతాలకే సరిపోతున్నాయి. గ్రామాభివృద్ధిలో భాగంగా మల్లేశ్కంపోస్ట్షెడ్, వైకుంఠధామం నిర్మాణానికి, పల్లెప్రగతిలో పారిశుధ్య పనులకు సొంత నిధులు వెచ్చించారు. ఇందుకోసం రూ. 3.1 లక్షల వరకు అప్పు చేశారు. సర్కారు ఎంతకీ బిల్లులు మంజూరు చేయకపోవడం, మరోవైపు వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక మల్లేశ్తన రెండెకరాల్లో అర ఎకరం పొలం అమ్మి రూ.2.5 లక్షల అప్పు చెల్లించారు. మరోవైపు సర్పంచ్గౌరవ వేతనం రూ.5 వేలు కూడా సకాలంలో ఇవ్వడం లేదు. దీంతో పూట గడవడమే గగనమయింది. గత్యంతరం లేక పార్ట్టైమ్గా రూ. 8 వేల జీతానికి రాత్రివేళ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్ గా నైటీ డ్యూటీ చేస్తున్నారు.