
సికింద్రాబాద్, వెలుగు : సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ రైళ్లను నడపనుంది. ఈనెల10న తిరుపతి–-సికింద్రాబాద్, నర్సాపూర్– -సికింద్రాబాద్, సికింద్రాబాద్–-కాకినాడ టౌన్, 11న కాకినాడ టౌన్– -సికింద్రాబాద్, సికింద్రాబాద్–-నర్సాపూర్, 12న సికింద్రాబాద్–-కాకినాడ టౌన్, 13న కాకినాడ టౌన్-– తిరుపతి రూట్ లో స్పెషల్ రైళ్లు అందుబాటులోఉంటాయని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.