
కామారెడ్డి, వెలుగు : ఎస్సెస్సీ సప్లిమెంటరీ పరీక్షల కోసం కామారెడ్డి జిల్లాలో 3 సెంటర్లను ఏర్పాటు చేశారు. మంగళవారం ప్రారంభమయ్యే ఈ పరీక్షలు 13 వరకు కొనసాగుతాయి. మొత్తం 695 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. కామారెడ్డిలో 1, బాన్సువాడలో 2 సెంటర్లు ఏర్పాటు చేశారు.
పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుందని, సెంటర్లోకి సెల్ఫోన్లు , ఎలక్ర్టానిక్ వస్తువులు తీసుకెళ్లవద్దని డీఈవో రాజు తెలిపారు. పరీక్షల నిమిత్తం డీఈవో ఆసీసులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఏవైనా సమస్యలు ఉంటే 9032695219కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.