జున్ 3 నుంచి ఎస్సెస్సీ సప్లిమెంటరీ పరీక్షలు

జున్ 3 నుంచి ఎస్సెస్సీ సప్లిమెంటరీ పరీక్షలు

కామారెడ్డి, వెలుగు : ఎస్సెస్సీ సప్లిమెంటరీ పరీక్షల  కోసం కామారెడ్డి జిల్లాలో  3 సెంటర్లను ఏర్పాటు చేశారు.  మంగళవారం ప్రారంభమయ్యే ఈ పరీక్షలు 13 వరకు కొనసాగుతాయి.  మొత్తం 695  మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.    కామారెడ్డిలో 1, బాన్సువాడలో 2 సెంటర్లు ఏర్పాటు చేశారు.  

పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుందని, సెంటర్​లోకి సెల్​ఫోన్లు , ఎలక్ర్టానిక్​ వస్తువులు తీసుకెళ్లవద్దని డీఈవో రాజు తెలిపారు.  పరీక్షల నిమిత్తం  డీఈవో ఆసీసులో  కంట్రోల్​ రూమ్​ ఏర్పాటు చేశామని, ఏవైనా సమస్యలు ఉంటే 9032695219కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.