
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ ఆర్టీసీ డిపో నుంచి యాదగిరిగుట్ట, స్వర్ణగిరికి సూపర్ లగ్జరీ బస్సును ఈ నెల 27 న డిపో మేనేజర్ రవి కుమార్ శనివారం తెలిపారు. 27న ఉదయం 6 గంటలకు డిపో నుంచి బస్సు బయలుదేరి10 గంటలకు యాదగిరి గుట్ట చేరుకుంటుందన్నారు.
అక్కడ దర్శనం, భోజనం చేసుకొని మళ్లీ మధ్యాహ్నం 2 గంటలకు స్వర్ణగిరికి బయలుదేరి దర్శనం తర్వాత తిరుగు ప్రయాణం రాత్రి 10 గంటలకు ఆర్మూర్ చేరుకుంటుందని చెప్పారు. ఒక రోజు యాత్ర కు ఒకరికి రూ.1,500 ఛార్జీలు నిర్ణయించామని తెలిపారు. భక్తులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు.