ఆలయాల బంగారాన్ని కరిగించడం కొత్తేమీ కాదు

ఆలయాల బంగారాన్ని కరిగించడం కొత్తేమీ కాదు

రాష్ట్రంలోని ఆలయాలకు చెందిన బంగారు నగలను కరిగించడం కొత్త విషయమేమీ కాదని.. అది ఎప్పటి నుంచో కొనసాగుతున్న ప్రక్రియ అని మద్రాస్ హైకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం చెప్పింది. 1977 నుంచే దేవాలయాలకు చెందిన బంగారు ఆభరణాలను కరిగించే విధానం అమలవుతోందని తెలిపింది. దీని గురించి అవగాహన లేకుండా కొందరు రాద్దాంతం చేస్తున్నారని చెప్పింది. ఇప్పటి వరకు 5 లక్షల గ్రాముల నగలను కరిగించి, కడ్డీల రూపంలోకి మర్చి, బ్యాంకుల్లో డిపాజిట్ చేశామని తెలిపింది. దీంతో  రాష్ట్ర ఖజానాకు రూ. 11 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం దాదాపు 2,137 కేజీల బంగారాన్ని ముంబైలోని ప్రభుత్వ మింట్ లో కరిగించాలని, కడ్డీలను జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని నిర్ణయించామని చెప్పింది.
 
ఆలయాల  బంగారు నగలను  కరిగించాలని సెప్టెంబర్ 9, 22 తేదీల్లో హిందూ రెలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ డిపార్ట్ మెంల్ నోటిఫికేషన్లు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను హైకోర్టు విచారించింది. తదుపరి విచారణను హైకోర్టు అక్టోబర్ 21కి వాయిదా వేసింది.