టీసీఎస్ ఆధ్వర్యంలో రూరల్ ఐటీ క్విజ్-2021 

టీసీఎస్ ఆధ్వర్యంలో రూరల్ ఐటీ క్విజ్-2021 
  • విజేత గణేష్ భరద్వాజ్

అమరావతి: చిన్న పట్టణాలు, గ్రామాలలో ఐటీ రంగం పట్ల అవగాహన మెరుగుపరిచే లక్ష్యంతో టాటా కన్సల్టెన్సీ  సర్వీసెస్‌ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది వర్చువల్ గా క్విజ్.. ఆన్ లైన్ ద్వారా  పాల్గొనే అవకాశం కల్పించారు. ఏపీ పాఠశాల విద్యా శాఖ మరియు కర్నాటక రాష్ట్ర ఐటీ, బీటీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖల సహకారంతో  టీసీఎస్‌ ఈ 22 వ ఎడిషన్‌ క్విజ్‌ను నిర్వహించారు.  

రాష్ట్ర వ్యాప్తంగా 8 నుండి 12వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఈ పోటీల్లో ప్రాథమిక ఆన్ లైన్ టెస్ట్ తర్వాత ఆరుగురు  విద్యార్థులను ఫైనల్స్ కు ఎంపిక చేశారు.  ఫైనల్స్‌లో  కృష్ణా జిల్లాలోని  కొమ్మారెడ్డి ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌  విద్యార్థి గణేష్ భరద్వాజ్ విజేతగా నిలిచాడు. తమడలోని ఏపీ మోడల్ హైస్కూల్ కు చెందిన పట్నాల హరితేజ రెండో స్ధానంలో నిలిచాడు. మొదటి బహుమతి విజేతకు 10వేలు, ద్వితీయ బహుమతి విజేతకు 7వేల రూపాయల విలువ కలిగిన వోచర్లు అందించారు.