వన్డే సిరీస్ పోయింది..నెంబర్ ర్యాంకు పోయింది

వన్డే సిరీస్ పోయింది..నెంబర్ ర్యాంకు పోయింది

టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్ను 1-2తో కోల్పోయిన భారత్..ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్లో టీమిండియా రెండో స్థానానికి దిగజారింది. వన్డే సిరీస్ ఓటమితో భారత్ 113 పాయింట్లకు పడిపోవడంతో సెకండ్ ప్లేస్లో నిలిచింది. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్ను దక్కించుకుంది. అయితే పాయింట్ల పరంగా టీమిండియాతో సమానంగా 113 పాయింట్లే ఉన్నా..కంగారూ జట్టు నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. 

వరుసగా గెలుపు...నెం.1 ర్యాంకు..

2023 జనవరిలో న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ను భారత జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేయడంతో  నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత శ్రీలంకపై 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. దీంతో భారత్ వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. ఇక ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ ను గెలిచిన టీమిండియా...మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో విజయం సాధించింది. అయితే  వైజాగ్, చెన్నై వన్డేల్లోనూ ఓడిపోయి సిరీస్ సమర్పించుకుంది.

నాలుగేళ్ల తర్వాత ఓటమి...

స్వదేశంలో వన్డే సిరీస్ను టీమిండియా నాలుగేళ్ల తర్వాత కోల్పోయింది. స్వదేశంలో భారత జట్టు చివరి సారిగా 2019లో వన్డే సిరీస్లో ఓటమిపాలైంది. అప్పుడు కూడా ఆస్ట్రేలియా చేతిలోనే  2-3 తేడాతో వన్డే సిరీస్  కోల్పోయింది.

ఘోర ఓటమి..

మూడు వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియా, భారత జట్టు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. అయితే  బుధవారం చెన్నైలో జరిగిన చివరి  మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్..50 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత 270 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు 49.1 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌట్ అయింది.