9 రోజుల్లో రూ.9 వేల కోట్ల భరోసా : మహదేవుని శ్రీనివాస్

9 రోజుల్లో రూ.9 వేల కోట్ల భరోసా : మహదేవుని శ్రీనివాస్
  • కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్ 

కొమురవెల్లి, వెలుగు: కాంగ్రెస్​ప్రభుత్వం 9 రోజుల్లో రూ.9 వేల కోట్లను రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో జమచేసిందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కొమురవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ..తెలంగాణలోని కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రైతు భరోసా నిధులు జమచేసినట్లు తెలిపారు. ఇచ్చిన హామీలతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న కాంగ్రెస్​ప్రభుత్వం ప్రజల మన్ననలను పొందుతుందన్నారు. 

మండలంలోని ఐనాపూర్, రసులాబాద్ గ్రామాల్లో ప్రభుత్వం నుంచి మంజూరైనా సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. జీడిపల్లి వరలక్ష్మికి రూ.60 వేలు, కొమ్ము ఎల్లయ్యకు రూ.24 వేలు, పచ్చిమడ్ల మల్లయ్యకు రూ.20 వేలు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల అధ్యక్షులు, మండల కార్యవర్గ సభ్యులు, మండల కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.