
- రెండు నెలలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
- వారంలో రిపోర్ట్ వచ్చే చాన్స్ ఉండగా.. ఇంతలోనే గడువు పెంపు
- ఇప్పటికే 109 మంది ఆఫీసర్లు, వ్యక్తుల స్టేట్మెంట్ల రికార్డ్
- ఇంకా ఎవరిని విచారిస్తారన్న దానిపై ఊహాగానాలు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. ఈ నెల 31తో కమిషన్ గడువు ముగుస్తుండగా.. జులై 31 వరకు పొడిగిస్తూ సోమవారం ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘హైదరాబాద్లో కమిషన్ తదుపరి సిట్టింగ్స్నిర్వహించి విచారణను పూర్తి చేసి జులై 31 నాటికి రిపోర్టును సమర్పిస్తుంది’’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిజానికి ఈ వారంలోనే ప్రభుత్వానికి కమిషన్ తన రిపోర్టు అందజేసేందుకు సిద్ధమైంది. అధికారులను, ఇంజనీర్లను విచారించి రిపోర్టుకు తుది మెరుగులు దిద్దుతున్నది. ఇలాంటి టైమ్లో అకస్మాత్తుగా ప్రభుత్వం కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగించడం, మళ్లీ విచారణ అంటూ ఉత్తర్వుల్లో పేర్కొనడం వెనుక మర్మమేమిటని రాజకీయ వర్గాలు, అధికారుల్లో చర్చ జరుగుతున్నది. కమిషన్ మళ్లీ సిట్టింగ్స్ నిర్వహిస్తుందని ప్రభుత్వం చెప్పడంతో ఇంకా పలువురి విచారించనుందనే విషయం స్పష్టమవుతున్నది. అయితే.. ఎవరిని విచారిస్తారనేది హాట్ టాపిక్గా మారింది.
ఏడోసారి..!
కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా చెప్పే మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. బ్యారేజీలోని ఏడో బ్లాక్ మీటరున్నర మేర భూమి లోపలికి కూరుకుపోయింది. దీనిపై అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ ఏ), ఇటు విజిలెన్స్ డిపార్ట్మెంట్లు విచారణ పూర్తి చేసి నివేదికలు
సమర్పించాయి.
ఇంకెవరున్నరు?
ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగించడం వెనుక ఆంతర్యమేమిటన్నది చర్చనీయాంశంగా మారింది. ఇంకెవరిని విచారణకు పిలుస్తారన్న దానిపై ఊహాగానాలు నడుస్తున్నాయి. అప్పట్లో అధికారులను విచారించిన తర్వాత.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించి నాటి సీఎం కేసీఆర్, నాటి ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు, నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ను విచారణకు పిలుస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ, కమిషన్ మాత్రం వారిని పిలువలేదు. వారి వాంగ్మూలాలు లేకుండానే రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించేందుకు రెడీ అయింది. రిపోర్టు సమర్పించడానికి ముందు కమిషన్.. లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లు తెలిసింది. కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్లో దాదాపు అధికారులందరూ అప్పటి ప్రభుత్వ నిర్ణయాలకు తగ్గట్టుగానే నడుచుకున్నామని చెప్పారు. ఈ క్రమంలో కేవలం అధికారుల స్టేట్మెంట్ల ఆధారంగానే రిపోర్ట్ను సమర్పిస్తే లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని, విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నోళ్ల స్టేట్మెంట్లు రికార్డు చేయాలని కమిషన్ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ను కూడా విచారించేందుకే కమిషన్ గడువును రెండు నెలలు పొడిగించి ఉంటారని అధికారులు చర్చించుకుంటున్నారు. వాటికి సమాంతరంగా కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ చైర్మన్గా 2024 మార్చి 13న కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేసింది.
తొలుత రిపోర్టు సమర్పించేందుకు ప్రభుత్వం అదే ఏడాది జూన్ 30 వరకు కమిషన్కు గడువు ఇచ్చింది. అప్పటికి ఇంకా ఎంక్వైరీ కూడా మొదలుకాకపోవడం.. ప్రాథమిక దశలోనే ఉండడంతో గడువును ఆగస్టు 30 వరకు పొడిగిస్తూ జూన్ 29న తొలిసారి గడువును పొడిగించింది. మళ్లీ విచారణ పూర్తికాకపోవడం.. అధికారుల అఫిడవిట్లు సమర్పణ దగ్గరే ఉండడంతో ఆ గడువు సరిపోలేదు. దీంతో రెండోసారి అక్టోబర్ 31 వరకు గడువును పొడిగిస్తూ ఆగస్టు 28న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అసలు విచారణ అప్పుడే మొదలు కావడం.. ఓపెన్ కోర్టులు నిర్వహించాల్సి ఉండడంతో డిసెంబర్ 31 వరకు గడువును మూడోసారి పొడిగిస్తూ నవంబర్ 12న ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత నాలుగోసారి 2025 ఫిబ్రవరి 28 వరకు గడువును పొడిగిస్తూ 2024 డిసెంబర్ 21న, ఐదోసారి 2025 ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ 2025 ఫిబ్రవరి 20న, ఆరోసారి గడువును 2025 మే 31 వరకు పొడిగిస్తూ 2025 ఏప్రిల్ 29న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఏడోసారి గడువును పొడిగిస్తూ జులై 31 వరకు కమిషన్ రిపోర్టుకు టైమ్ ఇచ్చింది.
తుది దశకు రిపోర్ట్!
వాస్తవానికి ఐదోసారి గడువును పొడిగించే సమయం నాటికే.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఇంజనీరింగ్, ఆర్థిక శాఖ అధికారులతో పాటు ఐఏఎస్లను కమిషన్ విచారించింది. 109 మంది అధికారులు, పలువురు స్వతంత్ర వ్యక్తుల స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. అయితే, వారు చెప్పిన వివరాల ఆధారంగా రిపోర్ట్ను సిద్ధం చేసే పని ఆలస్యం కావడంతో సర్కారు ఆరోసారి గడువును పొడిగించింది. ఇప్పుడు ఆ రిపోర్టు తుది దశకు వచ్చింది. ఈ నెల 21న సీఎస్కు కమిషన్ రిపోర్టును సమర్పించనున్నందన్న వార్తలు వచ్చాయి.