
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ 77.8% పనితనాన్ని చూపించింది. 25,800 మందిపై చేసిన మూడో దశ ట్రయల్స్లో వ్యాక్సిన్ మెరుగైన పనితీరు కనబరిచినట్టు వెల్లడైంది. ఆ ట్రయల్స్కు సంబంధించిన డేటాను వ్యాక్సిన్లపై ఏర్పాటు చేసిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ(ఎస్ఈసీ)కి కంపెనీ మంగళవారం అందజేసింది. ఆ డేటాను సమీక్షించేందుకు ఎస్ఈసీ సమావేశాన్ని నిర్వహించింది. మరిన్ని రివ్యూల కోసం ఆ డేటాను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి పంపించనుంది. ఇక, కొవాగ్జిన్కు అనుమతిని కోరుతూ భారత్ బయోటెక్ పెట్టుకున్న అప్లికేషన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. అనుమతుల విషయంపై బుధవారం సమావేశం కానుంది. ఇది పూర్తి రివ్యూ మీటింగ్ కాదని, వ్యాక్సిన్ నాణ్యత గురించి వివరించేందుకు భారత్ బయోటెక్కు ఇది ఓ అవకాశమని డబ్ల్యూహెచ్వో పేర్కొంది.