ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

 ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. రాజ్ భవన్ లో గవర్నర్ వద్ద కార్యదర్శిగా పనిచేస్తున్న ముఖేష్ కుమార్ మీనాను పరిశ్రమల శాఖలో ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసి.. ఆయన స్థానంలో ఆర్పీ సిసోడియాను గవర్నర్ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు. అలాగే రాష్ట్ర పన్నుల విభాగం చీఫ్ కమిషనర్ గా ఉన్న పీయూష్ కుమార్ ను సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేసి ఆ స్థానంలో నారాయణ్ ను నియమించి డ్రగ్ కంట్రోల్, కాపీరైట్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.  అలాగే హరిజవహర్ లాల్ కు సీసీఎల్ ఏ అదనపు కార్యదర్శిగా బదిలీ చేసి.. సీసీఎల్ ఏ అప్పీల్స్ కమిషనర్ గా లక్ష్మినరసింహకు అదనపు బాధ్యతలు అప్పగించారు.  ఈ మేరకు బదిలీల ఉత్తర్వులపై  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బదిలీ సంతకాలు చేశారు.