12న ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు టీఆర్ఎస్ ఏర్పాట్లు

12న ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు టీఆర్ఎస్ ఏర్పాట్లు
  • మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్: తెలంగాణ రైతుల నుంచి ధాన్యాన్ని కొనడానికి కేంద్రం నిరాకరిస్తున్నందుకు నిరసనగా ఈనెల 12న TRS ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నారు. ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పట్లను మంత్రి తలసాని, మహమూద్ అలీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన కొత్త అగ్రీ చట్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని ప్రోత్సహించకుండా కేంద్రం ఇబ్బంది పెడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకు నిరంతర పోరాటం చేస్తామన్నారు. దేశంలోని అన్ని ప్రతిపక్షాలను ఏకం చేసి ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు.