బోనాల ఉత్సవాలకు రావాలంటూ సీఎం కేసీఆర్కు ఆహ్వానం

 బోనాల ఉత్సవాలకు  రావాలంటూ సీఎం కేసీఆర్కు ఆహ్వానం

ఈ నెల (జున్ ) 17, 18 తేదీల్లో సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానంలో నిర్వహించనున్న బోనాల మహోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి కేసీఆర్  ను ఆలయ అధికారులు కోరారు. బుధవారం ప్రగతి భవన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో వారు  సీఎం కేసీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసిఆర్ కు అర్చకులు  వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించారు. సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో  ఆలయ  కార్యనిర్వహణాధికారి మనోహర్ రెడ్డి,దేవాలయ కమిటీ చైర్మన్ సూరిటి కామేశ్ దేవాలయ పూజారులు ఉన్నారు.అటు అమ్మవారి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నారు. బోనం తీసుకువచ్చే మహిళలల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్ లను ఏర్పాటు చేస్తున్నారు.