రాజిరెడ్డి ని అభినందించిన మంత్రి వివేక్

రాజిరెడ్డి ని అభినందించిన మంత్రి వివేక్

శివ్వంపేట, వెలుగు: నర్సాపూర్​ మున్సిపల్  చైర్​పర్సన్​ పదవిని కాంగ్రెస్  కైవసం చేసుకున్న సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి ఆవుల రాజిరెడ్డిని మంత్రి వివేక్ వెంకటస్వామి అభినందించారు. రాజిరెడ్డి బుధవారం హైదరాబాద్ లో మంత్రిని కలిశారు. 

నర్సాపూర్​ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని మంత్రిని కోరారు. కాంగ్రెస్  మండల అధ్యక్షుడు మల్లేశ్, మాజీ ఎంపీపీ లలిత, నాయకులు నవీన్  గుప్తా ఉన్నారు.