
- త్వరలో బ్రిటన్, యూరోప్, మలేషియాలో కూడా: ఈవో వెంకటరావు
హైదరాబాద్, వెలుగు: కెనడాలోని మాంట్రియల్ నగరంలో యాదగిరీశ్వరుడి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. టీసీఏ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మన్నెం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. యాదగిరిగుట్ట ఆలయం నుంచి ఏఈవో రఘు, ఆలయ విశ్రాంత ప్రధానర్చకుడు ఎన్. లక్ష్మీ నరసింహచార్యులు హాజరై కల్యాణోత్సవాన్ని జరిపించారు.
ఈ సందర్భంగా యాదగిరి గుట్ట ఈవో వెంకటరావు, అర్చకులు, ఉద్యోగులను మంత్రి కొండా సురేఖ అభినందించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ.. త్వరలో బ్రిటన్, యూరోప్, మలేషియాలో కూడా యాదగిరీశ్వరుడి కల్యాణోత్సవాలు నిర్వహించేందుకు మరికొన్ని బృందాలను పంపిస్తామని తెలిపారు.