ఎవరైతే డైట్లో ఉప్పు మానేస్తారో వారికి గుండెపోటు, గుండె సంబంధ వ్యాధుల ముప్పు 20 శాతం మేర తగ్గిపోతుందని యూకే పరిశోధకులు తేల్చారు. గుండె సంబంధ వ్యాధులు కలిగి ఉండి.. 40-70 ఏండ్ల వయసున్న 5 లక్షల మందిపై అధ్యయనం నిర్వహించారు
ఎవరైతే డైట్లో ఉప్పు మానేస్తారో వారికి గుండెపోటు, గుండె సంబంధ వ్యాధుల ముప్పు 20 శాతం మేర తగ్గిపోతుందని యూకే పరిశోధకులు తేల్చారు. గుండె సంబంధ వ్యాధులు కలిగి ఉండి, 40-70 ఏండ్ల వయసున్న 5 లక్షల మందిపై అధ్యయనం నిర్వహించారు. ఎవరైతే తమ ఆహారంలో ఉప్పు చేర్చుకోలేదో వారిలో గుండె సంబంధ వ్యాధుల ముప్పు 18 శాతం మేర తగ్గిపోయినట్టు తేల్చారు. అప్పుడప్పుడు మాత్రమే ఉప్పు వాడేవారిలో 15 శాతం మేర జబ్బు తగ్గుముఖం పట్టినట్టు గుర్తించారు. ముఖ్యంగా ఉప్పు తగ్గిస్తే ఆర్ట్రియల్ ఫిబ్రిలేషన్ (గుండె దడ) తగ్గిపోతున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు
మన శరీరం అంతటికి రక్త సరఫరా జరిగితేనే.. అన్ని అవయవాలు జీవక్రియను సజీవంగా చేయగలుగుతాయి. రక్తం ద్వారానే మన శరీరంలోకి గాలి, నీరు, ఆహారం, ఇతర పోషకాలు వెళ్తాయి. రక్తం ద్వారానే వ్యర్థాలు శరీర అవయవాల నుంచి బయటకు వస్తాయి. అయితే ఈ రక్తం శరీరం అంతా వెళ్లడానికి అతి ముఖ్యమైన భాగం గుండె. రక్తం పంప్ చేయడంతో.. గుండె కండరాలు(కార్డియాక్ మజిల్స్) ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి. అతి బలమైన కండరం కూడా ఇదే. అయితే గుండె సంకోచ, వ్యాకోచాలకు సవ్యంగా జరగకుండా చేసే ప్రధాన శత్రువు మనం తినే ఉప్పు.
ఊరగాయలను, తినే కూరలను పక్కనబెడితే… మొక్కజొన్న పొత్తుల్లో, జామ కాయల్లో, మామిడి కాయల్లో, నేరేడు కాయల్లో.. ఇలా అన్నింటికి టచ్చింగ్గా ఉప్పును తింటున్నారు చాలామంది. దీంతో గుండె కణజాలంలో కూడా ఉప్పు శాతం పెరుగుతుంది. ఆ ఉప్పుకు గట్టి పరిచే గుణం ఉంటుంది. అంచేత కార్డియాక్ మజిల్ హార్డ్ అయ్యి.. ముడుచుకుంటుంది కానీ సాగే గుణం కోల్పోతుంది. ఏజ్ గడిచే కొద్దీ కార్డియాక్ మజిల్.. బయటకు పంపే రక్తం మోతాదు తగ్గిపోతూ ఉంటుంది. అందుకే చాలామంది బరువు పనులు చేయలేరు. కనీసం మెట్లు కూడా ఎక్కలేరు. చిన్న, చిన్న పనులు చేసి కూడా ఓ రొప్పుతూ ఉంటారు.
ఎటువంటి గుండె జబ్బులకు ప్రధాన శత్రవు ఉప్పు కాబట్టి దానిపై ప్రధానమైన అటెన్షన్ పెట్టమని చెబుతున్నారు వైద్య నిపుణులు. యువత హఠాత్తుగా కుప్పకూలిపోవడానికి ఉప్పే ప్రధాన కారణమని చెబుతున్నారు. సాధ్యమైనంతవరకు ఉప్పును తగ్గించి.. . ఆల్టర్నేటివ్ ఆహార పదార్థాలను వినియోగిస్తే.. ఎంతో మంచిదని చెబుతున్నారు.
