రెండేండ్ల కిందే ఉద్యోగం ఫ్లైట్ క్రాష్ లో ఎయిర్ హోస్టెస్ దుర్మరణం

రెండేండ్ల కిందే ఉద్యోగం ఫ్లైట్ క్రాష్ లో ఎయిర్ హోస్టెస్  దుర్మరణం

న్యూఢిల్లీ: ఆమె ఎంతో కష్టపడి తన కలలను సాకారం చేసుకొంది. మణిపూర్ లోని తౌబాల్  జిల్లా అవాంగ్  లెయ్ కెయ్ కు చెందిన గంతోయి శర్మ కాంగ్ బ్రాయ్ లాట్పం 2023లో ఎయిరిండియాలో ఉద్యోగం సంపాదించింది. తనపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చి కుటుంబానికి ఒక భరోసాగా నిలిచింది 22 ఏండ్ల గంతోయి శర్మ. గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆమె కూడా చనిపోయింది. 

దీంతో ఆమె మరణవార్త విని కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఆమె దిగిన ఫొటోలను కండ్ల ముందు పెట్టుకుని జ్ఞాపకాలు నెమరువేర్చుకుంటూ కన్నీరు కారుస్తున్నారు. ‘నువ్వు ఎక్కడికి వెళ్లిపోయావు?’ అంటూ తీవ్రంగా రోదిస్తున్నారు. ‘బిడ్డా.. ఒక్కసారి కనిపించవా?’ అంటూ వారు రోదిస్తున్నారు. గంతోయి మరణంతో ఆమె స్వగ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.