సింహంతో పరాచకం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

సింహంతో పరాచకం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

జూలో పనిచేసే వారికి అక్కడి జంతువులతో మంచి అనుబంధమే ఉంటుంది. టైంకు తిండి పెట్టి, ఆలనా పాలనా చూసే వారి పట్ల వన్య మృగాలు సైతం ప్రేమగానే వ్యవహరిస్తాయి. కానీ తమ చేష్టలతో ఆ మూగజీవాలకు చిరాకు పుట్టిస్తే మాత్రం కథ వేరేలా ఉంటుంది. జమైకాలోని జూలో పనిచేసే ఓ జూ కీపర్ ఇలాగే సింహంతో పరాచకమాడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. చివరకు చేతి వేలు పోగొట్టుకున్నాడు.

జమైకాలోని ఓ జూలో పనిచేసే జూకీపర్ అక్కడ ఉన్న సింహాన్ని ఆటపట్టించాలనుకున్నాడు.  బోనులో చేయిపెట్టి దాని జూలు పీకుతూ చిరాకు పెట్టాడు. అంతటితో ఆగకుండా దాని నోటిలో వేలు పెట్టేందుకు ప్రయత్నించాడు. జూకీపర్ సతాయిస్తుండటంతో సింహానికి  చిర్రెత్తుకొచ్చింది. ఒక్కసారిగా అతని చేతి వేళ్లను అందుకుని కొరికేసింది. దీంతో అతను సింహం నుంచి కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. కొన్ని క్షణాల పాటు నరకం చూసిన జూకీపర్  చివరకు చేతిని వెనక్కి తీసుకోగలిగాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సింహం కొరకడంతో వేలికి తీవ్ర గాయమైంది. కండంతా పోయి కేవలం ఎముక మాత్రమే మిగిలింది. ఈ వ్యవహారం మొత్తాన్ని అక్కడ ఉన్న సందర్శకులు చూస్తూ వీడియో తీశారే తప్ప అతన్ని కాపాడేందుకు ఎవరూ ముందుకురాలేదు. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్గా మారింది.

మరిన్ని వార్తల కోసం..

జ్ఞానవాపి మసీదుపై ముగిసిన విచారణ..తీర్పు రిజర్వ్

కేసీఆర్ చేసేది రుణమాఫీ కాదు వడ్డీ మాఫీ