- 9 లక్షల విలువైన 1 కిలో 700 గ్రాముల గంజాయి స్వాధీనం
- ఎస్ నుండి చెన్నైకి కార్గో విమానంలో రవాణా
చెన్నై: ఎన్ని లాక్ డౌన్ లు విధించినా, ఎన్ని కర్ఫ్యూ లు పెట్టినా అక్రమార్కులు తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గత నెల 24 నుండి లాక్ డౌన్ ప్రకటించింది. దీని కారణంగా ప్రజారవాణా ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల విమానాలు కూడా అన్ని రద్దు అయ్యాయి. కానీ ట్రాన్స్ విమానాలు మాత్రమే అనుమతిస్తున్నారు. వీటిలో వైద్య సామాగ్రి, వైద్య పరికరాలు విదేశాల నుండి వస్తున్నాయి. ఈ సందర్భంలో, ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం పట్టణానికి ఎనిమిది పొట్లాలు వచ్చాయి. విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు వాటిని తనిఖీ చేసినప్పుడు అనుమానం వచ్చి ఆ పొట్లాలను పరిశీలించగా వాటిలో గంజాయి పొడి ఉన్నట్లు గుర్తించారు. ఆ ప్యాకెట్లలో రూ. 9 లక్షల విలువైన 1 కిలోల 700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విచారణ చేపట్టగా.. ఆంధ్రప్రదేశ్లోని చిరునామా నకిలీదని తెలిసింది. ప్రపంచం మొత్తం కరోనావైరస్ భయాందోళన స్థితిలో ఉన్నా, మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠా మాత్రం అక్రమ రవాణా చేస్తూనే ఉంది.