శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత

రంగారెడ్డి జిల్లా: భారీగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు ప్రయాణికులను శంశాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న  ఇద్దరు మహిళా ప్రయాణికులు పెద్ద ఎత్తున బంగారం తరలిస్తూ  అధికారులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.74 లక్షల విలువ చేసే 1410 గ్రాముల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇక..స్మగ్లర్లు రోజురోజుకు తెలివి మీరి పోతున్నారు. కొత్తదారులు వెతుక్కుంటూ మరీ అడ్డదారులు తొక్కుతున్నారు. కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాళ్ల కళ్లు కప్పి బంగారం తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో బంగారం తరలిస్తూ..  చివరికి పోలీసులకు చిక్కుతున్నారు.