మల్కాజిగిరి,వెలుగు: బాలికకు గంజాయి అలవాటు చేసి.. మత్తులో పలుమార్లు గ్యాంగ్ రేప్చేసిన పదిమందిని నేరెడ్మెట్పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద ఆరు సెల్ఫోన్లు, ఆటో, మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నేరెడ్మెట్పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్నగర్జిల్లాకు చెందిన ఓ మహిళ కుటుంబంతో ఉపాధి కోసం సిటీకి వచ్చి కాచిగూడలో ఉంటూ ఇండ్లలో పనులు చేస్తోంది.
మూడేండ్ల కిందట ఆమె భర్త చనిపోగా, కూతురు(12) స్కూల్చదువు మధ్యలోనే ఆపివేసి ఇంటి వద్దనే ఉంటోంది. బాలిక తన ఇంటి సమీపంలోని మరో అమ్మాయి ఇంటికి వెళ్లి మాట్లాడుతుండేది. ఒక రోజు బాలిక సెల్ఫోన్అమ్మాయి తీసుకుని తన ఫ్రెండ్స్ నేరెడ్మెట్చెందిన ఆటో డ్రైవర్చక్కోలు నరేశ్(26), సిరిపంగ విజయ్కుమార్ లకు కాల్ చేసింది. అనంతరం నరేష్(26) బాలికకు ఫోన్చేస్తూ పరిచయం పెంచుకుని తరచూ ఇంటికి వెళ్లేవారు.
బాలికను బైక్పై ఎక్కించుకుని నేరెడ్మెట్తీసుకెళ్లేవారు. వీరు పాత నేరస్తులు కావడం, గంజాయి తాగే అలవాటు ఉండడంతో ఆమెపై లైంగికదాడికి ప్లాన్ చేశారు. బాలికకు గంజాయి అలవాటు చేసి మత్తులోకి దింపి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. ఆపై తమ ఫ్రెండ్స్ వాగ్మారే బాలాజీ(23) , జీహెచ్ఎంసీ వర్కర్గుడ్డంకి కృష్ణ(22), టిఫిన్సెంటర్వర్కర్ తొంటె కిరణ్కుమార్(26), అమెజాన్డెలివరీ బాయ్ గా బొల్లెగోపు అజయ్(23), వాటర్క్యాన్స్సప్లయర్జేమ్స్జేవియర్(24), మల్కాజిగిరిలో ఉండే ఇంజమూరి మధు(30), వాగ్మేరా దీపక్(25), సబావత్ హతియా నాయక్(25) లకు బాలిక ఫోన్నంబరు ఇచ్చారు.
ఆమెకు ఫోన్ చేసి మాయమాటలతో నేరెడ్మెట్తీసుకొచ్చి లైంగికదాడికి పాల్పడుతుండగా, దీంతో బాలిక ఐదు నెలల గర్భం దాల్చింది. ఆమె శరీరంలో వచ్చే మార్పులను గమనించిన తల్లి ప్రశ్నించగా వాస్తవం చెప్పింది. వెంటనే తల్లి కాచిగూడ పోలీసులకు కంప్లయింట్ చేయగా జీరో ఎఫ్ఐఆర్ఫైల్ చేసి నేరెడ్మెట్పోలీసులకు బదిలీ చేశారు. దర్యాప్తు చేపట్టిన నేరెడ్మెట్పోలీసులు శనివారం నిందితులను అరెస్టు చేసి పోక్సో, కిడ్నాప్, లైంగికదాడి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపారు.