లోయలో పడ్డ కారు 10 మంది మృతి

లోయలో పడ్డ కారు 10 మంది మృతి
  • జమ్మూ- శ్రీనగర్ హైవేపై ఘటన

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌‌లోని రాంబన్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ప్యాసింజర్లతో శ్రీనగర్ నుంచి జమ్మూ  వైపు వెళ్తున్న ఓ కారు 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. జమ్మూ- –శ్రీనగర్ హైవేపై రాంబన్ జిల్లాలోని బ్యాటరీ చష్మా ఏరియా వద్ద ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. మృతులంతా వలస కార్మికులని..కారులో శ్రీనగర్‌‌కు వెళ్తున్నారని చెప్పారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్టీఆర్ఎఫ్) రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి పది మంది మృతదేహాలను వెలికితీసినట్లు వివరించారు. ఘటనపై జమ్మూకాశ్మీర్‌‌ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.