ఉమ్మడి ఖమ్మంలోని 10 స్థానాలు మావే : సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క

ఉమ్మడి ఖమ్మంలోని 10 స్థానాలు మావే :  సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క

మధిర/ఎర్రుపాలెం(ఖమ్మం), వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్సే గెలుస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. సోమవారం మధిర పార్టీ ఆఫీసులో భట్టి సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం కోసమే పాదయాత్ర చేశానని తెలిపారు. 

అలాగే ఎర్రుపాలెం మండలం రాజులదేవరపాడులో భట్టి మీడియాతో మాట్లాడారు. పబ్బులు, క్లబ్బుల కల్చర్​ అంటూ రాహుల్ గాంధీపై కేటీఆర్ మాట్లాడటం కరెక్ట్​ కాదని, బీఆర్ఎస్​ వచ్చాకే హైదరాబాద్​లో పబ్ కల్చర్, డ్రగ్స్ వాడకం పెచ్చురిల్లిందని మండిపడ్డారు. 

.కేసులకు భయపడి, బీజేపీ లీడర్లతో అంటకాగిన వారు ఈ విధంగా మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు. 

   ALSO READ :ధరణి డేటా.. విదేశీ కంపెనీ చేతుల్లోనే