లక్షా 9 వేల మెట్రిక్​ టన్నుల వడ్ల కొనుగోలు : చంద్రమోహన్​

లక్షా 9 వేల మెట్రిక్​ టన్నుల వడ్ల కొనుగోలు : చంద్రమోహన్​

కామారెడ్డిటౌన్​, వెలుగు: యాసంగి సీజన్​కు సంబంధించి కామారెడ్డి జిల్లాలో  ఇప్పటి వరకు 17,810 మంది రైతుల నుంచి   1,09,489 మెట్రిక్​ టన్నుల వడ్లను కొనుగోలు చేసినట్లు  అడిషనల్​ కలెక్టర్​ చంద్రమోహన్​ తెలిపారు.  శుక్రవారం  చిన్నమల్లారెడ్డి, లింగాయపల్లి,   పొందూర్తి వడ్ల కొనుగోలు సెంటర్లను ఆయన పరిశీలించారు.

  అకాల వర్షాలు కురిస్తే  వడ్లు తడవకుండా ఉండేందుకు సెంటర్లలో  టార్పాలిన్లు  అందుబాటులో ఉంచేలా చూడాలని సిబ్బందికి సూచించారు.  కాంట అయిన వెంటనే రైతు వివరాల్ని ఆన్​లైన్లో అప్​లోడ్​ చేయాలన్నారు.   డీఎస్​వో మల్లిఖార్జునబాబు,  డీఎం  నిత్యానంద్​, తదితరులు ఉన్నారు.