కర్రెగుట్టల్లో వరుసగా ఐఈడీల పేలుళ్లు..11 మంది జవాన్లకు తీవ్ర గాయాలు

కర్రెగుట్టల్లో వరుసగా ఐఈడీల పేలుళ్లు..11 మంది జవాన్లకు తీవ్ర గాయాలు

భద్రాచలం, వెలుగు: తెలంగాణ బార్డర్​లోని ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం బీజాపూర్​ జిల్లా కర్రెగుట్టల్లో ఆదివారం సాయంత్రం వరుసగా ఆరు చోట్ల ఐఈడీలు పేలాయి. ఈ ఘటనలో 11 మంది జవాన్లు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే రాయ్​పూర్​ ఆసుపత్రికి హెలికాప్టర్​ ద్వారా తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురికి ఆపరేషన్ చేయగా, మరో 8 మందికి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స చేస్తున్నారు. 

డీఆర్జీ, బస్తర్​ ఫైటర్స్, కోబ్రా బలగాలు కూంబింగ్​కు వెళ్లిన సమయంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు పేలాయి. కోబ్రా సబ్​ ఇన్స్ పెక్టర్​ రుద్రేశ్​ సింహ్​కు తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరి కాళ్లకు దెబ్బలు తగిలాయి. ముగ్గురు జవాన్ల కళ్లకు కూడా గాయాలయ్యాయి. ఊసూరు పోలీస్​స్టేషన్​ పరిధిలోని కర్రెగుట్టల్లో జరిగిన ఈ ఘటనతో భద్రతాబలగాలు ఉలిక్కిపడ్డాయి. బాంబు స్క్వాడ్​లతో గుట్టలను జల్లెడపడుతున్నాయి.