బ్రెజిల్ లో కాల్పుల మోత..11 మంది మృతి

బ్రెజిల్ లో కాల్పుల మోత..11 మంది మృతి

బ్రెజిల్ లో కాల్పుల మోత మోగింది. పారా రాష్ట్రం బెలెమ్ నగరంలోని ఓ బార్ లో గుర్తు తెలియని వ్యక్తులు బైకులపై వచ్చి  కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 11 మంది చనిపోయారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు.  కాల్పులు జరిపి పారిపోతున్న దుండగుల్లో ఒకరిని పట్టుకున్నారు పోలీసులు. ఈ కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియలేదు.