టీఆర్ఎస్ లో కొనసాగుతోన్న రాజీనామాలు

టీఆర్ఎస్ లో  కొనసాగుతోన్న రాజీనామాలు

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. కరీంనగర్ లో 11 మంది టీఆర్ఎస్ నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యమకారుల పట్ల కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగానే రాజీనామా చేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ బరిలో నిలిచిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ వెంట నడవాలని నిర్ణయించినట్లు తెలిపారు. బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రె రాజు తోపాటు.. వివిధ డివిజన్లకు చెందిన నేతలు టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.