అబ్దుల్లాపూర్ మెట్టులో భారీగా గంజాయి పట్టివేత

అబ్దుల్లాపూర్ మెట్టులో భారీగా గంజాయి పట్టివేత

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టులో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిషా, విశాఖపట్నం ఏజన్సీ ప్రాంతాల నుండి ట్రావెల్స్ బస్సుల ద్వారా గంజాయి సరఫరా అవుతుందన్న సమాచారంతో ఎక్సైజ్ అధికారులు అబ్దుల్లాపూర్ మెట్టులో ట్రావెల్స్ బస్సులపై దాడులు చేశారు. దీంతో ఓ బస్సులో 12కేజీల గంజాయినీ గుర్తించి పట్టుకున్నారు. ఒడిషా నుండి హైదరాబాద్ కు బస్సులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.