తెలంగాణలో కొత్తగా 12 కొత్త ఒమిక్రాన్ కేసులు

తెలంగాణలో కొత్తగా 12 కొత్త ఒమిక్రాన్ కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ మరో 12 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 79కి చేరింది. ఎట్ రిస్క్ దేశాల నుండి వచ్చిన వారికి పరీక్షలు చేయగా ముగ్గురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. అలాగే పాన్ రిస్క్ దేశాల నుండి వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా 9మందికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. రాష్ట్రంలో అక్టీవ్ ఒమిక్రాన్ కేసులు 52 ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరో 10 కేసులలో ఒమిక్రాన్ రిపోర్టు రావాల్సి ఉందని పేర్కొంది. మరో వైపు కరోనా కేసులు కూడా రాష్ట్రంలో పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 317 కరోన కేసులు నమోదు అయ్యాయి.