ఐబీఎస్ లో ర్యాగింగ్.. కేటీఆర్ ట్వీట్ తో 12మందిపై కేసు

ఐబీఎస్ లో ర్యాగింగ్.. కేటీఆర్ ట్వీట్ తో 12మందిపై కేసు

హైదరాబాద్ శివార్లలోని  ఇండియన్ బిజినెస్ స్కూల్ లో ర్యాగింగ్  ఘటన కలకలం రేపుతోంది. ఓ జూనియర్ ను సీనియర్లు చితక బాదారు. రూమ్ లో డోర్ పెట్టి    అతడిని తీవ్రంగా కొట్టారు. ర్యాగింగ్ అనంతరం విద్యార్థులు కాలేజ్ గ్రూప్స్ లో వీడియోలను అప్లోడ్ చేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇరువురిని  రాజీకుదుర్చీ పంపించారనే ఆరోపణలు వస్తున్నాయి.  

ఘటనపై బాధిత విద్యార్థి మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్లో ఫిర్యాదు చేశాడు. నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి కేటీఆర్ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు సూచించారు. మంత్రి ట్వీట్ తో  ర్యాగింగ్ కు పాల్పడిన  12మందిపై శంకర్ పల్లి పోలీసులు  కేసు నమోదు చేశారు. ఆ 12 మంది విద్యార్థులను కాలేజీ  యాజమాన్యం  సంవత్సరం పాటు సస్పెండ్ చేసింది. దర్యాప్తు అనంతరం మరికొంత మంది స్టూడెంట్స్ పై  చర్యలు తీసుకునే అవకాశం ఉంది. IBS కాలేజీ విద్యార్ధులకు.. దొంతనపల్లి గ్రామ శివారులో ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలేజీలో ర్యాగింగ్ కూడా ఎప్పటినుంచో జరుగుతున్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.