
- క్లౌడ్ మల్టీజోన్ రీజియన్స్ ఏర్పాటు
న్యూఢిల్లీ: యూఎస్ ఐటీ కంపెనీ ఐబీఎం ఎయిర్టెల్ క్లౌడ్ కోసం ముంబై, చెన్నైలో రెండు కొత్త మల్టీజోన్ రీజియన్స్ను నిర్మిస్తుంది. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ భాగస్వామ్యం వల్ల ఎయిర్టెల్ క్లౌడ్ సామర్థ్యాలు పెరుగుతాయి.
మల్టీజోన్ రీజియన్ల ఏర్పాటుతో భారత్లో ఎయిర్టెల్ క్లౌడ్ జోన్ల సంఖ్య నాలుగు నుంచి పదికి పెరుగుతుంది. బ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వం వంటి రంగాలలో మిషన్ -క్రిటికల్ అప్లికేషన్ల కోసం ఎయిర్టెల్ క్లౌడ్ కస్టమర్లు ఐబీఎం పవర్ సిస్టమ్స్ పోర్ట్ఫోలియోను ఉపయోగించుకోవచ్చని ఎయిర్టెల్ సీఈఓ విఠల్ చెప్పారు.