జీడిమెట్ల, వెలుగు: యువకుడి హత్య కేసులో 13 మంది నిందితులను బాచుపల్లి పోలీసులు బుధవారం రిమాండ్కు పంపారు. నలుగురు మైనర్లు కావడంతో జువైనల్ హోమ్ కు తరలించారు. బాచుపల్లి సీఐ ఉపేందర్ తెలిపిన ప్రకారం.. గతేడాది అక్టోబర్24న ఎస్ఆర్నగర్ పరిధిలోని దాసరామ్బస్తీకి చెందిన యువకుడు తరుణ్రాయ్(22) హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నిందితులైన షేక్షరీఫ్, బూరగోని అభిషేక్ అలియాస్ అభి, పిల్లి తేజస్ అలియాస్ తేజ, బండ నాగరాజు, గజానంద్రాహుల్, రాబిన్ బెన్సీలు అరెస్ట్ అయ్యారు. ఇటీవల షేక్ షరీఫ్, తేజస్ బెయిల్ పై వచ్చారు. దీంతో తరుణ్రాయ్ బంధువు రోహిత్ తన ఫ్రెండ్ దినేశ్ తో పాటు మరికొందరితో కలిసి తేజస్ను మర్డర్ చేసేందుకు ప్లాన్ చేశారు.
ముందుగా తేజస్ ఇంటిని కామన్ ఫ్రెండ్ శివప్ప ద్వారా కనుగొనడమే కాకుండా హత్య చేయాలని కోరారు. గత ఆదివారం రాత్రి ప్రగతినగర్ లోని తేజస్ ఇంట్లో శివప్పతో పాటు ఫ్రెండ్స్ కౌషిక్, మహేశ్మద్యం తాగారు. అప్పటికే మోతీనగర్లోని అల్సఫా హోటల్ వద్ద రోహిత్తన ఫ్రెండ్స్ తో వచ్చి ఎదురు చూస్తున్నారు. శివప్పవాళ్లకు లొకేషన్ షేర్చేశాడు. ముందుగా సిద్దేశ్వర్నాయక్, జయంత్ప్రగతినగర్ కు వచ్చారు. రోహిత్, దినేశ్, ప్రతీక్, రాహుల్, సునీల్, గనప్ప, సంతోష్, శ్రీకర్ తమ బైక్ లపై వచ్చి అక్కడికి వచ్చి పరిసరాలను గమనించారు.
తేజస్ను శివప్ప సిగరెట్ తాగుదామని బిల్డింగ్పై నుంచి కిందికి తీసుకొచ్చి స్కూటీపై ఎక్కించుకుని సమీర్, సిద్దేశ్వర్ నాయక్, జయంత్ఉండే ప్రాంతానికి తీసుకెళ్లి ఆపాడు. ఇది గమనించిన తేజస్పారిపోయేందుకు యత్నించగా సిద్దేశ్వర్నాయక్, జయంత్లు ముందుగా కత్తితో తేజస్ ను పొడిచారు. అనంతరం సమీర్రాయితో కొట్టడడంతో తేజస్కిందపడగా.. శివప్ప కత్తితో అతని మెడను కోశాడు. అతడు చనిపోయాడని నిర్దారించుకుని వెళ్లిపోతూ ప్రతీకార హత్య చేశామని వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్లో వైరల్చేశారు. తేజస్ హత్య కేసులో నిందితులైన 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద 6 సెల్ఫోన్స్, 4 బైక్ లు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.