14 మంది ఖైదీలకు క్షమాభిక్ష

14 మంది ఖైదీలకు క్షమాభిక్ష

హైదరాబాద్​, వెలుగు: జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ క్షమాభిక్ష పెట్టింది. మంచి ప్రవర్తన ఉన్న ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్రంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 14 మంది ఖైదీలను విడుదల చేసేందుకు రాష్ట్ర హోంశాఖ నిర్ణయించింది. వారి జాబితాను ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మూడు విడతల్లో వారిని విడుదల చేసేందుకు జైళ్ల శాఖ డీజీ సందీప్​ శాండిల్య చర్యలు ప్రారంభించారు. అక్టోబర్​ 2, వచ్చే ఏడాది ఏప్రిల్​ 6, అక్టోబర్​ 2న విడుదల చేయనున్నారు. జైలు నుంచి విడుదలయ్యే ఖైదీలు ₹50 వేల సొంత పూచీకత్తుతో బాండ్​ సమర్పించాలని, బయటికొచ్చాక మళ్లీ నేరాలకు పాల్పడితే అరెస్ట్​ చేసి జైలుకు పంపుతామని స్పష్టం చేశారు.

వీళ్లే ఆ ఖైదీలు

చంచల్​గూడ జైలు: పీ కృష్ణ, అవినాష్​, మహ్మద్​ ఆరిఫ్​, మద్దు జవహర్​ బాబు

చర్లపల్లి సెంట్రల్​ జైలు: సంపంగి వడ్డే శేఖర్, పీ వీరేశం

వరంగల్​ సెంట్రల్​ జైలు: దాదావత్​ రాజు, మేక నరేశ్​, యాట రమేశ్​, కునరపు రాయమల్లు

కరీంనగర్​:-  వలమంజల తిరుపతి

నిజామాబాద్​ జిల్లా జైలు:వీ ప్రవీణ్​

మహబూబ్​నగర్​ జిల్లా జైలు: కవ్వు గోవిందు, కవ్వు సురేశ్