ఈఎస్​ఐకి మార్చిలో 14.05 లక్షల కొత్త మెంబర్లు

ఈఎస్​ఐకి మార్చిలో 14.05 లక్షల కొత్త మెంబర్లు

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్​ స్టేట్​ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్​(ఈఎస్​ఐసీ) అమలు చేసే సోషల్​ సెక్యూరిటీ స్కీమ్​కోసం  2022 మార్చి లో 14.05 లక్షల మంది కొత్తగా పేర్లను నమోదు చేసుకున్నారని  నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్​ఎస్​ఓ) తెలిపింది. అంతకుముందు నెలలో వీటి సంఖ్య 12.70 లక్షలని ప్రకటించింది. ఈఎస్​ఐసీలో స్థూలంగా కొత్త ఎన్‌రోల్‌మెంట్‌లు 2021–-22లో 1.49 కోట్లు కాగా 2020–-21లో 1.15 కోట్లకు చేరాయి. 2019–-20లో 1.51 కోట్ల మంది చేరగా,  2018–-19లో 1.49 కోట్ల మంది రిజిస్టర్​ అయ్యారు. 2017 సెప్టెంబర్  నుండి  2018 మార్చి వరకు  దాదాపు 83.35 లక్షల మంది కొత్త సబ్‌స్క్రయిబర్లు ఈఎస్​ఐసీ పథకంలో చేరారు.  2017 సెప్టెంబర్ నుండి  2022 మార్చి వరకు ఈఎస్​ఐసీలో స్థూలంగా కొత్త చేరికలు 6.48 కోట్లని ఎన్​ఎస్​ఓ పేర్కొంది. ఈఎస్​ఐసీతోపాటు ఈపీఎఫ్ఓ కోసం  పీఎఫ్​ఆర్​డీఏ  కొన్ని సామాజిక భద్రతా పథకాలను నిర్వహిస్తోంది.