పంజాగుట్ట, వెలుగు : బేగంపేట మహాత్మ జ్యోతిరావుఫూలే ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 1,428 ఫిర్యాదులు అందాయి. వీటిలో హౌసింగ్ కు సంబంధించి 397, రెవెన్యూ డిపార్ట్మెంట్కు 350, సివిల్సప్లైకు 114 ఫిర్యాదులు వచ్చాయి. మిగతా 567 ఇతర విభాగాలకు చెందినవి ఉన్నాయి. భూ సమస్యలు తీర్చాలని, ఇండ్లు, రేషన్కార్డులు ఇవ్వాలని కోరుతూ పలువురు అర్జీలు అందజేశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, నోడల్అధికారి దివ్యదేవరాజన్ ఫిర్యాదులు స్వీకరించారు.
బెల్లంపల్లికి చెందిన ఆరోపల్లి పద్మ తాను బతికుండగానే చనిపోయినట్లు తన పిన్ని లక్ష్మి డెత్సర్టిఫికెట్తీసుకుందుని ఫిర్యాదు చేసింది. తన తండ్రి మృతి అనంతరం వచ్చిన ఉద్యోగాన్ని, ప్రభుత్వం డబ్బును కాజేసిందని పేర్కొంది. అలాగే జీఓ నంబర్లు 81, 85 ప్రకారం 3,797 మంది వీఆర్ఏల(61 ఏండ్లు పైబడినవారు) వారసులకు వెంటనే నియామక ఉత్తర్వులివ్వాలని పలువురు కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. డీఎస్సీ–2012లో ఎంపికై, సవరణల కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్అభ్యర్థులకు తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని రాజ్కుమార్అనే వ్యక్తి కోరారు. ప్రజావాణిలో వినతి అందంజేశారు.