హైదరాబాద్మాదాపూర్లో జులై 19వ తేదీ బుధవారం రాత్రి గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. స్కోడా కారులో గంజాయి తరలిస్తుండగా డ్రగ్ పెడ్లర్ ను పోలీసులు పట్టుకున్నారు. కారులో 148 కిలోల మేలు రకం గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
గంజాయిని ఏపీలోని నర్సీపట్నం నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర కు 72 ప్యాకెట్ల గంజాయిని తరలిస్తున్నట్లు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ఈ కేసులో నకుల్ గైక్వాడ్, శివ, సంతోష్ లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇందులో నకుల్, సంతోష్ లపై ఇప్పటికే రాజమండ్రిలో కేసులు నమోదైనట్లు వెల్లడించారు.