ఇజ్రాయెల్‌పై ఒకే రాత్రి 15 రాకెట్ల దాడి

ఇజ్రాయెల్‌పై ఒకే రాత్రి 15 రాకెట్ల దాడి

బుధవారం గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్‌పై 15 రాకెట్లతో దాడి జరిగిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) తెలిపింది. అందుకు ప్రతీకారంగా ఐడిఎఫ్ కూడా గాజాలోని ఆయుధాలు మరియు పేలుడు పదార్థాల తయారీ కర్మాగారం మరియు సైనిక సమూహాలపై దాడిచేసినట్లు తెలిపింది.

‘గాజాలోని ఉగ్రవాదులు మంగళవారం రాత్రి నుండి ఇజ్రాయెల్‌పై 15 రాకెట్లను పేల్చారు. ప్రతిస్పందనగా, మా వైమానిక దళం గాజాలోని హమాస్ లక్ష్యాలను, ఆయుధాలు మరియు పేలుడు పదార్థాల తయారీ కర్మాగారం మరియు సైనిక సమూహాలపై దాడి చేసింది. ఇజ్రాయెల్‌పై దాడి చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా మేం యుద్ధం చేస్తాం’ అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ట్వీట్ చేసింది. అంతకుముందు ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ ఇజ్రాయెల్‌లో వైమానిక దాడికి పాల్పడింది.

For More News..

మొక్కలకు ఫస్ట్​ బర్త్​డే చేసిన కార్పొరేటర్ దంపతులు

రాష్ట్రంలో కొత్తగా 2,273 కరోనా కేసులు.. 12 మంది మృతి

డబుల్ బెడ్‌రూం పేరిట ఫేక్‌ అలాట్‌మెంట్‌ లెటర్స్‌.. ఫేక్ కీస్