
- కాదంటే న్యాయమైన పరిహారానికి డిమాండ్
- ప్రైమరీ నోటిఫికేషన్పై వ్యతిరేకత
- అభ్యంతరాలపై ప్రభుత్వానికి హెచ్ఎండీఏ రిపోర్ట్
హైదరాబాద్సిటీ, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ట్రిపుల్ ఆర్ మార్గంపై హెచ్ఎండీఏ విడుదల చేసిన ప్రైమరీ నోటిఫికేషన్కు ఆయా ప్రాంతాల్లోని రైతుల నుంచి భారీ సంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ట్రిపుల్ఆర్ను 354 కి.మీ. పరిధిలో 100 అడుగుల వెడల్పుతో నిర్మించనున్నారు. ఓఆర్ఆర్కు వెలుపల ఉన్న 8 జిల్లాలు, 33 మండలాలు, 163 గ్రామాల్లో భూములు ప్రభావితం కానున్నాయి. అయితే, ఈ అలైన్మెంట్వల్ల తమకు జీవనాధారమైన భూములు పొతున్నాయని, ఇచ్చేది లేదని, అలైన్మెంట్మార్చాలని రైతులు డిమాండ్చేస్తున్నారు. న్యాయమైన పరిహారం అయినా ఇవ్వాలని కోరుతున్నారు.
సూచనల కంటే అభ్యంతరాలే ఎక్కువ
ట్రిపుల్ఆర్(దక్షిణ) అలైన్మెంట్వివరాలను ఈనెల మొదటి వారంలోనే హెచ్ఎండీఏ తన వెబ్ సైట్ లో ఉంచి సెప్టెంబరు 15 వరకు అభ్యంతరాలు, సూచనలు చేయాలని కోరింది. అలైన్మెంట్ను వ్యతిరేకిస్తూ నల్లగొండ, యదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్నగర్జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు అధికారులకు ఇప్పటికే వినతి పత్రాలు అందజేశారు. అలాగే, గడువు లోపు సూచనల కంటే అభ్యంతరాలే ఎక్కువగా వ్యక్తం చేశారు. మొత్తం 1500 మంది అభ్యంతరాలు వ్యక్తం చేయగా, మర్రిగూడెం, తలకొండ, కొండాపూర్తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఆబ్జక్షన్స్వ్యక్తమైనట్టు సమాచారం.
రిపోర్ట్ రెడీ చేస్తున్న అధికారులు
ట్రిపుల్ఆర్పై వచ్చిన అభ్యంతరాలపై నివేదిక సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే ప్రభుత్వానికి అందజేస్తామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. దీంతో ఈ ప్రాజెక్టు భవితవ్యం ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందంటున్నారు.
రేడియల్ రోడ్డుకు భూములు తీసుకోవద్దు
పరిగి, వెలుగు: రేడియల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని కోరుతూ పరిగి నియెజకవర్గ రైతులు మంగళవారం తహసీల్దార్ వెంకటేశ్వరీకి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు బ్యానర్ పట్టుకుని వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. రేడియల్ రింగ్ రోడ్డు కోసం 8 గ్రామాలకు చెందిన 200 కుంటుంబాల రైతులు సుమారుగా 360 ఎకరాల భూమిని కోల్పోతున్నారని వారన్నారు. తమ భూములు ఇవ్వబోమని, ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూసుకోవాలని అన్నారు.