పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం1,509 ఫిర్యాదులు అందాయి. వీటిలో ఎక్కువ శాతం భూసమస్యలు, ఉద్యోగాలు, రేషన్కార్డులు, డబుల్బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించినవే ఉన్నాయి. ప్రజావాణి ఇన్చార్జ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ ఫిర్యాదుదారులతో మాట్లాడి, సమస్యలు తెలుసుకున్నారు. జీఓ నంబర్ 46తో నష్టపోయిన మెరిట్స్టూడెంట్లు తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. వెంటనే జీఓను రద్దు చేయాలని కోరారు. డీఎస్సీ 2008 నోటిఫికేషన్ తో కామన్మెరిట్లో సెలక్ట్ అయి నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలని పలువురు అభ్యర్థులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 15, 20, 30 మార్కులు వచ్చిన వారు ఉద్యోగాలు చేస్తున్నారని, 72, 70, 65 మార్కులు వచ్చినా, ఉద్యోగాలు రాలేదని వాపోయారు.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం ఎస్సై నగేశ్భూకబ్జాదారుడు చింతకంది కుమారస్వామితో కుమ్మక్కై తమను బెదిరిస్తున్నట్టు సాదం వాసవి, జయశ్రీ శ్రావణ్తండ్రి కుమార్స్వామి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మేడ్చల్జిల్లా శామీర్పేట మండలం బొమ్మరాసిపేటలో అచ్చుత్ఇనిస్టిట్యూట్, లియోనియా రిసార్ట్స్లో పనిచేస్తున్న దళిత మహిళా కార్మికులను కులంపేరుతో దూషిస్తూ దాడులకు పాల్పడుతున్న న్యాయవాది దామోదర్రెడ్డి, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాలమల్లేశ్అనే వ్యక్తి ఆధ్వర్యంలో పలువులు మహిళలు ఫిర్యాదు చేశారు. కరీంనగర్కు చెందిన 40 మంది మహిళలు డబుల్బెడ్రూమ్ఇండ్లు ఇవ్వాలని కోరుతూ అర్జీ అందజేశారు.
ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలి
మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన పఠాన్జమీల్ఖాన్ 2006 నుంచి 2019 వరకు అమెరికా, మలేషియా, శ్రీలంక దేశాల్లో జరిగిన కరాటే, కుంగ్ ఫు, తైక్వాండో పోటీల్లో పాల్గొని మెడల్స్సాధించాడు. ఇంటర్నేషనల్ స్థాయిలో 35 గోల్డ్మెడల్స్, రెండు సార్లు వరల్డ్గిన్నీస్ రికార్డులు సాధించాడు. మొత్తంగా 115 మెడల్స్ పఠాన్జమీల్ఖాన్ప్రస్తుతం సిటీలోని మెహిదీపట్నంలో ఉంటున్నాడు. స్పోర్ట్స్కోటాలో గ్రూప్–1 ఉద్యోగంతోపాటు ఇంటి స్థలం ఇవ్వాలని అర్జీ అందజేశాడు.